బొజ్జ గణపయ్యను గరిక(గడ్డి) తో పూజించడం వెనుక అసలు రహస్యం

Loading

Garika Pooja

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు . ఈయన అగ్ని సంబంధమైన తేజస్సు తో జన్మించాడు . అందువల్ల ఆయన శరీరము నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి . అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్ధిచాడు . గణపతి అనలాసురుడిని తన బొటన వ్రేలితో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు . అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడంవల్ల విఘ్నేశ్వరుని ఉదరము లో అమితమైన వేడి పుట్టింది . దాంతో ఆయన బొజ్జలో వివరీతమైన తాపము పుట్టింది . దేవతలు ఆయన భాదను చూడలేక నీటితోను , అమృతం తోను ఎంత అభిషేకించినా ప్రయోజమం లేకపోయింది . నివారణ కోసము ఈశ్వరుని ప్రార్ధించగా …. అప్పుడు మహేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజింపమని చెప్పెను . సంస్కృతము లో గరికను ” దూర్వలం ” అంటారు . శివుడు ఇచ్చిన సలహాతో గణపతి తాపము వెటనే చల్లారిపోయింది .

శ్రావణమాసం లో వచ్చే బహుళ చతుర్ధి గణపతి కి అత్యంత ప్రీతికరమైన రోజు . ఈ రోజున సంకష్టహర చతుర్ధీ వ్రతాన్ని ఆచరించడం సర్వ విఘ్నహరం . ఈ నామాలు మహా విశేష ఫలప్రదమైనవి. నిరంతరం పఠించిన శుభములు కలుగును. విఘ్నేశ్వరుణునికి గరిక (గడ్డి) పత్రం అంటే మహాప్రీతి.

విఘ్నేశ్వరుని పూజలలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలలోను ” గరిక (గడ్డి) ” పత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టము . గరికతో పూజిస్తాం గనుక ఈ స్వావిని దూర్వాగణపతి అని కూడా పిలుస్తారు . ఈ స్వామిని అర్చించేటపుడు జంట గరికపోచలతో ఇరవై ఒక్కసార్లు పూజించాలన్న నియమము ఉన్నది .

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి
హనుమాన్ చాలీసా

Related Posts

No results found.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.