శ్రీ శుభకృత్ నామ సంవత్సరే, ఉత్తరాయణే, శిశిరఋతౌ,
మాఘమాసే, కృష్ణపక్షే శనివారం అనగా ది.. 18వ తేది ఫిబ్రవరి 2023 తేదీన మహాశివరాత్రి.
మహా శివరాత్రి రోజున శివనామ స్మరణము చేసినా, శివార్చన చేసినా విశేషమైన ఫలితము పొందెదరని శివమహా పురాణము లో సుస్పష్టంగా ప్రస్తావించబడినది. సాధారణంగా మహా శివరాత్రి రోజు అంతా అర్చనా, ఉపవాసాది కార్యక్రమములు చేసి స్వామి వారు మనలను అనుగ్రహించే సమయంలో మాత్రం ఆయనను దర్శనం చేసుకోకుండా కాలయాపన చేసెదము. ఆ సమయమే లింగోద్భవ సమయము.
Please submit the below form to get the Puja Vidhanam link over the mail.
ఉదయమంతా ఎంతటి ఉపవాసం చేసియున్నా, ఎన్ని శివ కార్యక్రమములలో పాల్గొన్నా మరియు జాగారణలను చేసియున్నా లింగోద్భవ సమయంలో మాత్రం స్వామి వారిని దర్శించక పొతే తద్వారా కలిగే ప్రయోజనం నిష్ఫలితము. సాధారణంగా లింగోద్భవ కాలం మహా శివరాత్రి రోజు రాత్రి 11:56 PM నుండి 12:46 AM వరకు మధ్యలో సంభవించును.

లింగోద్భవ కలం సమయాలు – 18|19 ఫిబ్రవరి 2023
- మహా శివరాత్రి లింగోభవ శివార్చన సమయం – రాత్రి 11.56 నుండి 12.46 గంటల వరకు (11.56 PM, 18 ఫిబ్రవరి నుండి 12.46 AM 2023 ఫిబ్రవరి 19న)
శుభ సమయాల జాబితా, 18 ఫిబ్రవరి 2023
- త్రయోదశి ప్రదోష కాల పూజ సమయం 18th ఫిబ్రవరి 2023 – 6.07 PM నుండి 8.02 PM వరకు
- మహా శివరాత్రి లింగోభవ శివార్చన సమయం – రాత్రి 11.46 నుండి 12.56 వరకు (18-19 ఫిబ్రవరి 2023)
- మహా శివరాత్రి మొదటి ప్రహర పూజ సమయం – సాయంత్రం 6.07 నుండి 9.14 రాత్రి, 18 ఫిబ్రవరి2023 (1వ యామము సమయం)
- మహా శివరాత్రి రెండవ ప్రహార పూజ సమయం – రాత్రి 9.14 నుండి 12.21 వరకు, 18 ఫిబ్రవరి 2023 (2వ యామం సమయం)
- మహా శివరాత్రి మూడవ ప్రహర పూజ సమయం – అర్ధరాత్రి 12.21నుండి 3.28 గంటల వరకు (00.21 AM నుండి 3.19 AM, 19 ఫిబ్రవరి 2023) (3వ యామం సమయం)
- మహా శివరాత్రి నాల్గవ ప్రహర పూజ సమయం – రాత్రి 3.28 నుండి మరుసటి ఉదయం 6.35 వరకు (3.28 AM నుండి 6.35 AM, 19 ఫిబ్రవరి 2023) (4వ యామం సమయం)
- మహాశివరాత్రి వ్రత పారణ సమయం 19 ఫిబ్రవరి 2023 – ఉదయం 7.05
Please submit the below form to get the Puja Vidhanam link over the mail.
లింగోద్భవ సమయంలో శివపూజ ఎందుకు?
ఈ లింగోద్భవ కాలంలో పరమేశ్వరునికి చేసే అభిషేకము లేదా అర్చన లేదా ఏ ఇతర పూజ అయిన అనంత పుణ్యఫలితములను ఇచ్చెదను. లింగోద్భవ సమయమందు మారేడు దళములతో అర్చన చేసిన శివలింగము యొక్క దర్శనము చేసుకొన్నంత మాత్రం చేతను 76 జన్మలలో చేసిన పాపములు నశించునని సాక్షాత్తు ఆ మహేశ్వరుడే పార్వతికి చెప్పెనని పురాణాలలో పేర్కొనడం జరిగినది. అందుచేత ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ కావునా ఒక కణము జలము, ఒక్కింత భస్మము మహా శివరాత్రి రోజున లింగోద్భవ కాల సమయమందు పరమేశ్వరునికి సమర్పించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుచూ…
మీ,
రవికుమార్ శర్మ పెండ్యాల
పురోహితులు – నిర్వాహకులు
Pandit Poojalu Services
(Govt of Telangana Registered)
Cell: 9908 23 45 95